విశ్వకార్తిక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణం’. రమాకాంత్ రెడ్డి దర్శకుడు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మాత. మార్చి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్ తెలుగులో రాలేదు. కడప జిల్లాలో 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం.
అంతర్లీనంగా చక్కటి సందేశంతో యువత, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాతలు: డాక్టర్ కె చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర్ రెడ్డి, కాటం రమేష్, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, దర్శకుడు: రమాకాంత్ రెడ్డి.