తమిళంలో మూడు చిత్రాల్లో హీరోగా నటించిన నరేన్ రామా ‘కలియుగం పట్టణంలో’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్రలో నటించిన నరేన్ రామా మాట్లాడుతూ ‘గుమ్మడిగారు నాకు తాతయ్య వరుస అవుతారు. తెలుగు వాళ్లమే అయినా చెన్నైలో స్థిరపడ్డాం.
ఈ సినిమాలో నా పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుంది. ఇదొక థ్రిల్లర్ మూవీ. యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల తెలుగు రాష్ర్టాల్లోని కొన్ని పట్టణాల్లో కాలేజీ టూర్స్కు వెళ్లాం. అంతటా అద్భుతమైన స్పందన లభించింది. తెలుగులో ఈ సినిమా నాకు శుభారంభాన్నిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘డబ్ల్యుహెచ్ఓ’ అనే చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’ అన్నారు.