స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళింగ’. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలు. సెప్టెంబర్ 13న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ ‘లవ్, ఎమోషన్స్, కామెడీ, హారర్, థ్రిల్లర్ అన్ని అంశాలు కలబోసిన చిత్రమిది.
తెలుగులో ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్ రాలేదు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. అధికభాగం చిత్రీకరణ అడవుల్లో జరిపామని, విజువల్స్పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.