భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకుడు. డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఓ చిట్టితల్లీ..’ అంటూ సాగే ఈ సినిమా పాటను సీనియర్ నటులు మురళీమోహన్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘కలశ’ టైటిల్ సాంగ్ను దర్శకులు వీరశంకర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి అతిథులు శుభాకాంక్షలు అందించారు. ఇప్పటివరకూ భారతీయ తెరపై ఇలాంటి కథ రాలేదని, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాత చెప్పారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, గ్రాండియర్గా ఈ సినిమా రావడానికి కారకులైన నిర్మాతకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు చెప్పారు.