టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తమ అభిమానులకి ఎప్పటికీ పంచదార బ్యూటీనే.35 ఏళ్ల వయస్సులోను తన అందంతో మంత్రముగ్ధులని చేస్తున్న కాజల్ని చూసి ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా పెళ్లైన తర్వాత కాజల్ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
నాగ్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కాజల్ వేశ్యగా కనిపించనుందట. స్పైగా కనిపిస్తూనే ఉగ్రవాదుల సీక్రేట్స్ తెలుసుకోడానికి వేశ్యగా కనిపించే పాత్ర ఇది అంటున్నారు. ఇక తమిళంలో రూపొందుతున్న ‘రౌడీ బేబీ’ అనే సినిమాలో కాజల్ నటిస్తుండగా, ఈ సినిమాలో కాజల్ డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుంది. తల్లి కూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ ఓ అమ్మాయికి తల్లిగా సత్తా వున్న క్యారెక్టర్ చేయనుందని తెలుస్తోంది.
కాజల్ నటించిన ఆచార్య సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాలతో అలరిస్తూ వస్తున్న కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు ఫొటో షూట్స్తోను రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా తాను ఎయిర్పోర్ట్లో ఫొటోగ్రాఫర్స్కి ఫోజులివ్వగా, ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పిక్స్లో కాజల్ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాజల్ మొహంలో కళ లోపించినట్టుగా కనిపిస్తుందని అంటున్నారు. పెళ్లైన తర్వాత కాజల్ ఇలా మారడాన్ని అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు.