సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ శనివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో జారిపడ్డారు. ఆ కారణంగానే ఆయన అస్వస్థతకులోనయ్యారని సమాచారం. తెలుగు చిత్రసీమలో నవరస నటసార్వభౌమగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ రెండేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘మహర్షి’ తర్వాత ఆయన మరే సినిమాలో నటించలేదు.