K. Vishwanath | సినిమాలను ఆహ్లాదం కోసమే కాదు.. ఆలోచించేవిధంగా కూడా తీయోచ్చని తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయి, ప్రశ్నిస్తాయి, కష్టపడితే విజయం మనదే అనే ధైర్యాన్నిస్తాయి. సమాజంలోని సమస్యలే ఆయన సినిమాలు. ఆచారాలకంటే మనవత్యం గొప్పదని ‘శంకరాభరణం’తో చాటి చెప్పాడు. మనుషులను విడదీసే కుల వ్యవస్థను నిర్మూలించాలని ‘సప్తపది’ తెరకెక్కించాడు.
కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని ‘స్వయంకృషి’తో తెలియజేశాడు. అవినీతి అక్రమాలను ఎదుర్కోవడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే సరైనదని ‘సూత్రధారులు’ సినిమాతో భోదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కళాతపస్వి జ్ణానంలో నుండి వచ్చిన ప్రతీ కథ ఒక పాఠమే. తొలి సినిమా ఆత్మగౌరవం నుండి దర్శకుడిగా వందకు వంద మార్కులు సంపాదించుకున్నాడు. గొప్ప దర్శకుడు అవ్వాలంటే వందలకు పైగా సినిమాలు తీయక్కర్లేదు. వంద మంది గుర్తుపెట్టుకునే సినిమా తీయాలి అని ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఆయన ఫిల్మోగ్రఫిలో ప్రతీ సినిమా ఒక అద్భుతమే.