ముంబై : బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరామండి సిరీస్ ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఆ వెబ్ సిరీస్లో మాజీ నటి జూహీ చావ్లా నటించనున్నది. నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ రిలీజ్ కానున్నది. హీరామండి సిరీస్లో కనీసం 18 మంది ఫిమేల్ యాక్టర్లు ఉండనున్నారు. అయితే ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, మనీషా కోయిరాలా, నిమ్రత్ కౌర్, సంజిదా సేక్, డయానా పెంటీలు లైన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు వారికి తోడుగా జూహీ చావ్లా కూడా చేరనున్నది. 8 వారాల పాటు వెస్ సిరీస్ను ప్రసారం చేయనున్నారు. భన్సాలీతో భేటీ అయిన జూహ్లీ వెంటనే తన రోల్కు ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పాత్ర షూటింగ్ ప్రారంభంకానున్నది. నిజానికి హీరామండి కథ లాహోర్కు చెందినది. కానీ దాన్ని ముంబై బ్యాక్గ్రౌండ్లో భన్సాలీ చూపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ కోసం కొన్ని ఎపిసోడ్లను భన్సాలీ డైర్టక్ చేయనున్నాడు. భన్సాలీతో గతంలో పనిచేసిన విభూ పురి, మిటాక్షర కుమార్లు మిగితా ఎపిసోడ్లను డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.