కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ (Bollywood)కు హిట్స్ గా నిలిచిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటి జుగ్ జుగ్ జీయో ( Jugjugg Jeeyo). కియారా అద్వానీ (Kiara Advani), వరుణ్ ధవన్ లీడ్ రోల్స్ లో నటించగా.. అనిల్ కపూర్, నీతూ కపూర్ కీ రోల్స్ పోషించారు.
ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ ఇవాళ రీరిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ పీవీఆర్ సినిమాస్లలో రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది ప్రొడక్షన్ హౌస్. తాజా అప్డేట్ ప్రకారం కేవలం నార్తిండియాలో మాత్రమే రీరిలీజ్ అయింది జుగ్ జుగ్ జీయో. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. మూవీ లవర్స్, అభిమానుల విజ్ఞప్తి మేరకు మేకర్స్ రీరిలీజ్ ప్లాన్ చేశారు.
కియారా అద్వానీ ప్రస్తుతం ఆర్సీ 15తోపాటు గోవిందా నామ్ మేరా చిత్రంలో నటిస్తోంది. మరోవైపు వరుణ్ ధవన్, సమంతతో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తున్నాడు.