Jr.Ntr With Team india Players | గతేడాది డిసెంబర్ నెలలో తారక్ కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం అమెరికాకు వెళ్ళాడు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ చేసుకున్నాడు. ఇక అక్కడ ఉన్న సమయంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని సందడి చేశాడు. హాలీవుడ్ మీడియాలకు పలు ఇంటర్వూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. ఇక ఇటీవలే గ్లోబల్ అవార్డును నాటు నాటు గెలుచుకోవడంపై అందరికీ ఓ వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే తారక్ ఇటీవలే హైదరాబాద్కు తిరిగివచ్చాడు. కాగా తాజాగా తారక్ టీమిండియా క్రికెటర్లతో కలిసి ఫోటోలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
శ్రీలంకతో వైట్వాష్ తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో తలపడనుంది. న్యూజిలాండ్తో మూడు వన్డే సిరీస్లతో పాటు మూడు టీ20లు ఆడనుంది. కాగా తొలి వన్డేకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్ను కలిశారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, యజువేంద్ర చాహల్, శుభమన్ గిల్, శార్దూల్లు సోమవారం రాత్రి తారక్ను కలుసుకున్నారు. అనంతరం తారక్తో కలిసి వాళ్లందరూ డిన్నర్ చేసినట్లు తెలుస్తుంది.
ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు గెలుచుకోవడంతో భారతీయ సినీ ప్రేక్షకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక ఇటీవలే క్రిటిక్ చాయిస్ అవార్డ్స్లో భాగంగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్, బెస్ట్ సాంగ్ కేటగిరిల్లో రెండు అవార్డుల గెలుచుకుంది. నాటు నాటు పాట ఆస్కార్కు కూడా షార్ట్లిస్ట్ అయింది.
ప్రస్తుతం తారక్, కొరటాలతో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆడియో టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా కథ నీళ్ల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో తారక్కు జోడీగా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు టాక్.