రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పునఃప్రారంభమైంది. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక ఘట్టాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితమే రామ్చరణ్ సెట్స్లో అడుగుపెట్టగా బుధవారం నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో భాగమయ్యారు. తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్చరణ్లపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్తో టాకీపార్ట్ పూర్తవుతుందని చెబుతున్నారు. వచ్చే నెల ప్రథమార్థంలో అలియాభట్, రామ్చరణ్లపై పాటను తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రణాళికల్ని సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది. అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది.