ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది. 2019లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘వార్’ సినిమాకు సీక్వెల్గా ఇది రూపొందనుంది. ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకువచ్చింది. దీపావళి రోజున ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. రెండు సినీ పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ప్రాజెక్ట్గా ఈ సినిమా దక్షిణాది, బాలీవుడ్ మధ్య వారధిగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.