‘కేజీఎఫ్-2’ అపూర్వ విజయంతో దర్శకుడు ప్రశాంత్నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా అవతరించారు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో ఎన్టీఆర్ తీక్షణ చూపులతో శక్తివంతంగా కనిపిస్తున్నారు. ‘రక్త ధారల్లో తడిసిపోయిన మట్టిని మాత్రమే మనం గుర్తుంచుకోవడానికి యోగ్యమైనదిగా భావించాలి…అది అతని గడ్డ, సామ్రాజ్యం…కానీ అతని రక్తం మాత్రం కాదు’ అంటూ సినిమా గురించి ప్రశాంత్నీల్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇరవైఏళ్ల క్రితమే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఆలోచించానని..అభిమాన హీరోతో తన కలను నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందని ప్రశాంత్నీల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్.