విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న సినిమా ‘జోరుగా హుషారుగా’. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ సంస్థలో నిరీశ్ తిరువీధుల నిర్మిస్తున్నారు. అనూ ప్రసాద్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను నటుడు సాయికుమార్ హైదరాబాద్లో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు అనూ ప్రసాద్ మాట్లాడుతూ…‘కోవిడ్ టైమ్లో కష్టాలకు ఓర్చి సినిమాను పూర్తి చేశాం. మధ్యతరగతి కుటుంబ కథా చిత్రమిది. కథను నడిపే బరువంతా హీరోపైనే ఉంటుంది. పాటల రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. మధునందన్, రోహిణి, సోనూ ఠాగూర్, క్రేజీ ఖన్నా, సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.