ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటెడ్గా ఉండే కథ ఇది. నా పాత్ర తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోశ్గా ఇందులో కనిపిస్తాను. ఈ సినిమాకోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా’ అన్నారు యువహీరో విరాజ్ అశ్విన్. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయిక. అనుప్రసాద్ దర్శకుడు. నిరీశ్ తిరువీధుల నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విరాజ్ మాట్లాడారు. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని బెక్కం వేణుగోపాల్ చెప్పారు. ఇంకా సాయికుమార్, సోహైల్, తిరువీర్, సుడిగాలి సుధీర్, కథానాయిక పూజిత, దామోదర ప్రసాద్, నిర్మాత నిరీశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.