ముంబై : షారుక్ ఖాన్, దీపికా పదుకునె, జాన్ అబ్రహం వంటి స్టార్స్తో తెరకెక్కిన పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పఠాన్ 5 రోజుల్లోనే రూ . 500 కోట్ల గ్రాస్ వసూళ్లతో షారుక్ ఖాన్కు కమ్బ్యాక్ ఫిల్మ్గా నిలిచింది.
పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో చిత్ర బృందం సోమవారం సక్సెస్ మీట్ను నిర్వహించింది. మీడియా ప్రతినిధులతో సమావేశమైన చిత్ర యూనిట్ పఠాన్ గ్రాండ్ సక్సెస్పై సంతోషాన్ని పంచుకుంది. మీడియా సమావేశంలో షారుక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం షారుక్ ఖాన్ నెంబర్ వన్ యాక్షన్ హీరో అని కింగ్ ఖాన్ను జాన్ అబ్రహం ప్రశంసించారు.
షారుక్, దీపికా పదుకునెలతో కలిసి పనిచేయడం మరపురాని అనుభవం అని గుర్తుచేసుకున్నారు. యాక్షన్లో షారుక్ ఖాన్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారని, యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో కాన్ఫిడెంట్గా షారుక్ నటించారని అన్నారు. పఠాన్ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అన్నారు జాన్ అబ్రహం. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ మూవీ తెరకెక్కింది.