కరోనా తర్వాత సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొందరు కరోనా వలన కన్నుమూయగా, కొందరు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఒకరి మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల బిగ్బాస్ విన్నర్, బాలిక వధు సీరియల్ ఫేం సిద్ధార్థ్ శుక్లా కన్నుమూయగా, ఆయన మృతితో టీవీ, సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజాగా జీ టీవీ షో ‘జోధా అక్బర్’లో సలీమా బేగం పాత్రను పోషించిన టెలివిజన్ నటి మనీషా యాదవ్ మెదడులో రక్తస్రావం జరగడం వలన మరణించింది. ఈ విషయం తెలిసిన ఆమె కో యాక్ట్రెస్ పరిధి శర్మ తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొఘల్స్ అనే పేరు ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. శనివారం మనీషా మరణం గురించి గ్రూప్లో చూసి షాక్ గురయ్యాను’ అని తెలిపింది పరిధి శర్మ. మనీషాకి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడని, ఆ బాబు పరిస్థితి గురించి ఆలోచిస్తేనే ఎంతో ఆందోళనగా ఉందని బాధని వ్యక్తం చేసింది.