Jithender Reddy | ఉయ్యాల జంపాల (Uyyala Jampala ), మజ్ను (Majnu 2016) చిత్రాల ఫేమ్ దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రె హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 08న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది.
‘1980 దశకంలో ఓ వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సమాజం పట్ల ఎంతో అంకితభావం కలిగిన ఆ యువకుడు కాలేజీ నాయకుడిగా, అనంతరం పోలీస్ ఆఫీసర్గా ఎదిగి వ్యవస్థను ఎలా ప్రక్షాళనం చేశాడనే అంశాలను చూపిస్తున్నాం. పొలిటికల్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్.జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్.
#JithenderReddy Getting Ready.
WW Theatres 8th NOV 2024 pic.twitter.com/sFJHLY0f9T
— Moviedeed (@moviedeed) October 20, 2024