సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం కొత్త ట్రైలర్ను విడుదల చేశారు.
మధ్యతరగతి ప్రజలను మోసం చేసి దుబాయ్కి పారిపోతున్న ప్రజాపతిని (అజయ్) పట్టుకోవడానికి నిర్వహించే సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం వినోదాన్ని పంచింది. హీరో సత్య సీరియస్గా కనిపిస్తూనే నవ్వించారు. యాక్షన్ సీన్స్లో కూడా వినోదాన్ని పండించారు. సత్య-వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్గా నిలిచింది. ఫ్లైట్ నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్నందించారు.