బిగ్ బాస్ ఆడిన డ్రామాకు ప్రతి ఒక్కరు బిత్తర పోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నజస్వంత్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా.. పర్లేదు బాగానే ఉంది కానీ.. పడుకుంటే భూమి గుండ్రంగా తిరిగినట్టుగా అనిపిస్తుందని చెప్పాడు జెస్సీ. దీంతో బిగ్ బాస్.. మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం.. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.అందరికి బై చెప్పి మెయిన్ గేట్ నుండి బయటకు రావాలని చెప్పాడు.
ఇక కన్ఫెషన్ రూం నుండి బయటకు వచ్చిన జస్వంత్.. నా ఆరోగ్యం బాగోలేక నేను బయటకు వెళుతున్నాను అని చెప్పాడు. దీంతో సిరి, షణ్ముఖ్ బోరు బోరున ఏడ్చారు. అయితే జెస్సీ వెళ్తూ వెళ్తూ చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. నా హెల్త్ బాలేనందుకు చాలామంది పేంపరింగ్ చేశారు. మానస్, సన్నీ, కాజల్, పింకీ, ఆనీ అందరూ. షణ్ముఖ్, సిరి పేర్లను చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నా హార్ట్కి దగ్గరైన వాళ్లు. మీ ఇద్దరితో జర్నీ ఈరోజు వరకే ఉంది.. ఇక్కడివరకే నేను బిగ్ బాస్ చూస్తా. నేను సాధించలేకపోతున్నా.. అది మీరు చేసి చూపించాలి’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు జెస్సీ.
అందరికి వీడ్కోలు పలుకుతూ బిగ్ బాస్ని వీడిన జస్వంత్ని తీసుకెళ్లి సీక్రెట్ రూంలో ఉంచారు. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ.. ‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు.. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు జెస్సీ. అయితే జస్వంత్ ఆరోగ్య పరిస్థితులని గమనించిన డాక్టర్స్ అంతా బాగుందని అన్నారట. కానీ.. ఇంట్లోకి వెళ్లడానికి ముందు క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకూ మీరు క్వారంటైన్లోనే ఉండాలని చెప్పారు బిగ్ బాస్.