సెప్టెంబర్ 5న బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది.19 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ప్రవేశించారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగగా, ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు పొందిన సరయూ, జశ్వంత్, రవి ,హమీద ,మానస్, కాజల్లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటింగ్స్ పడుతుండగా, జశ్వంత్ పడాలకు కాస్త తక్కువ ఓటింగ్ పడుతున్నట్టు తెలుస్తుంది.
మొదట్లో చూసినప్పుడు చాలా అమాయకంగా వ్యవహరించిన జశ్వంత్ రాను రాను వివాదాస్పదంగా మారుతున్నాడు. 2018లో ఈ సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలిచి ఇప్పుడు ఆ క్రేజ్తో బిగ్ బాస్ ఛాన్స్ అందుకున్నాడు. అయితే ప్రతి రోజు ఆయన వివాదాస్పదం అవుతూ నెటిజన్స్కి చిరాకు తెప్పిస్తున్నాడు. మొదటి రోజు కన్నీరు పెట్టుకున్న జెస్సీ ఆ తర్వాత సీనియర్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు.
అనీ మాస్టర్ని కూర్చోనివ్వకుండా కాలు అడ్డుగా పెట్టడంతో లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడంతో క్షమాపణలు చెప్పాడు. నామినేషన్లో ఉన్న వారిలో జెస్సీ ప్రవర్తనే ప్రేక్షకులకి కాస్త విసుగు తెప్పిస్తుండడంతో ఆయనని ఈ వారం ఎలిమినేట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. గత సీజన్స్లో మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కౌశల్,అలీ రెజా మంచిగా రాణించగా ఈ సారి జెస్సీ తొలి వారం ఇంటి బాట పట్టనున్నట్టు తెలుస్తుంది.