Jeevitha Rajashekhar | టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితపై జోస్టర్స్ ఫిలింస్ అధినేతలు ఆర్థిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘గరుడవేగ’ సినిమాకు రూ. 26 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గోట్టారని శుక్రవారం జోష్టర్ ఫిలింస్ నిర్వాహకులు కోటేశ్వరరాజు, హేమలు శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. గరుడవేగ సినిమాకు ఆస్తులు తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చామని, తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వట్లేదని జోష్టర్ సంస్థ వెల్లడిచింది. తాజాగా వీటిపై ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్లో జీవిత స్పందించింది.
సుమారు రెండు నెలల ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్మీట్ పెట్టి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారో తెలియదని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదరని, అవన్ని తప్పుడు ఆరోపణలు అని పేర్కొంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతాం. మాపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారని, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయిని జీవిత ప్రెస్మీట్లో భాగంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈమె తన భర్త రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు దర్వకత్వం వహించింది. సస్పెన్స్ థ్రిల్లర్గా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయినా ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది.