‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ద్వారా నాయకానాయికలుగా అరంగేట్రం చేస్తున్నారు యువజంట దినేష్కుమార్, షాలిని. ప్రముఖ వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దినేష్కుమార్, షాలిని పాత్రికేయులతో ముచ్చటించారు. దినేష్కుమార్ మాట్లాడుతూ ‘మా స్వస్థం శ్రీకాకుళం జిల్లా పాలకొండ. దర్శకుడిది కూడా మా ఊరే. కాస్టింగ్కాల్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో నేను సత్య అనే పూజారి పాత్రలో కనిపిస్తా.
గ్రామంలో అల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా బంధంలో చోటుచేసుకున్న సమస్యలు ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సుమతో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించా. ఈ సినిమాతో నటుడవ్వాలనే నా కల ఫలించింది’ అన్నారు. షాలిని మాట్లాడుతూ ‘నేను హైదరాబాద్లోనే పుట్టిపెరిగాను. కాలేజీ రోజుల నుంచే నటనపై ఆసక్తి ఉండేది. తొలుత తమిళంలో షార్ట్ఫిల్మ్స్ చేశా. ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంలో నా పాత్ర అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. తప్పకుండా నాకు గుర్తింపు నిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.