ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కుమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా రూపొందిస్తున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నరేన్ వనపర్తి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు బి.గోపాల్ క్లాప్నివ్వగా, బెక్కెం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నేను దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. యువతరం మెచ్చే కథతో తెరకెక్కించబోతున్నాం. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుపెడతాం’ అన్నారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని నిర్మాత మల్లికా రెడ్డి పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివ, నిర్మాణ సంస్థ: జేపీ ప్రొడక్షన్స్, నిర్మాత: మల్లికా రెడ్డి.