Shah Rukh Khan | హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారుఖ్ ఖాన్నే. ఆయన సినిమా రిలీజవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో షారుఖ్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాతో కేవలం సౌత్లోనే షారుఖ్కు రెండొందల కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో వారంలో టీజర్ రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుందట. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ రూ.36 కోట్లు పలికిందట. టీ-సిరీస్ సంస్థ అన్ని భాషలకు కలుపుకుని ఈ రేట్తో డీల్ కుదిరించనున్నట్లు సమాచారం. ఒక్క ఆడియో హక్కులే ఈ రేంజ్లో బిజినెస్ చేశాయంటే జవాన్ సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అనురుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.