JAWAN Movie | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తాజా చిత్రం జవాన్పై ఆనంద్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan).. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ (Jawan) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన జవాన్ ప్రీవ్యూ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ (Zindha Bandha)ను మేకర్స్ రిలీజ్ చేశారు. జిందా బందా అంటూ సాగిన ఈ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ను షేక్ చేస్తుంది. అయితే ఈ జిందా బందా సాంగ్ చూసిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా షారుఖ్ ఖాన్ డాన్స్పై తాజాగా స్పందించారు.
“57 ఇయర్స్లాగా ఉన్నాడా.. ఈ హీరో (Shah Rukh Khan). అయన వయస్సు రోజురోజుకి తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. చాలామంది కుర్రాళ్ళ కంటే 10 రెట్లు ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నాడు” అంటూ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఈ పోస్టు వైరల్ కాగా దీనిపై షారుఖ్ ఖాన్ తాజాగా స్పందించాడు.
This hero is 57 years old?? Clearly his ageing process defies gravitational forces! He’s 10X as alive as most people. #ZindaBanda ho to aisa…
pic.twitter.com/3Qaa2iC30U— anand mahindra (@anandmahindra) August 1, 2023
“లైఫ్ చాలా చిన్నది. తొందరగా గడిచిపోతది ఆనంద్ మహీంద్రా సర్. దానితో పాటు పోటి పడాలి. ఎంత మందిని ఎంటర్టైన్ చేయగలిగితే అంతమందిని ఎంటర్టైన్ చేయాలి. దాని కోసం నవ్వాలి, ఎడవాలి, కదలాలి, ఎగరాలి, వీలు అయితే నక్షత్రాలతో కలిసి స్విమ్ చేసేలా చేయాలి. ఆనందపు క్షణాల గురించి కలలు కనాలంటూ” షారుఖ్ ఖాన్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
@anandmahindra Life is so short and fast sir, just trying to keep up with it. Try and entertain as many whatever it takes….laugh..cry…shake…or fly…hopefully make some to swim with the stars….dream for a few moments of joy. https://t.co/3bP8Xth1yG
— Shah Rukh Khan (@iamsrk) August 2, 2023
అనిరుధ్ రవిచంద్రన్ స్వర పరిచిన ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించాడు. చంద్రబోస్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇక ఈ పాట కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చుపెట్టినట్లు , బాంబే నుంచి వెయ్యి మంది డాన్సర్లను రప్పించారని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేసింది. అయితే విజువల్ పరంగా మాత్రం ఆ పాట హై స్టాండడ్స్లో ఉంది. ముఖ్యంగా శోభి పౌల్రాజ్ కొరియెగ్రఫి చాలా స్టైలిష్గా ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్కు జోడీగా నయనతార నటించింది.