బిగ్ బాస్ హౌజ్లో జరుగుతున్న టాస్క్లు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని కలిగిస్తున్నాయి. సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియతో హౌజ్ హీటెక్కగా, ఆ తర్వాత జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చగానే మారుతుంది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ ఇచ్చి.. రవి-సన్నీలకు రెండు రాజ్యాలను కేటాయించి.. ఇంటి సభ్యుల్ని రెండు భాగాలుగా విభజించారు.
రెండు రాజ్యాలకు సంబంధించిన ప్రజలు కుస్తీ పోటీలు పడుతున్నారు రవి రాజ్యం నుంచి విశ్వ, ఆనీ, శ్వేతా బరిలోకి దిగనుండగా, సన్నీ రాజ్యం నుంచి.. మానస్, జెస్సీ, పింకీలను ప్రకటించారు. మొదటిగా విశ్వ, మానస్లు పోటీ పడ్డారు. ఇందులో మానస్.. విశ్వకు గట్టి పోటీ ఇచ్చాడు.చివరకు విశ్వ.. మానస్పై గెలిచాడు.
అనంతరం జెస్సీకి పోటీగా ఎవరిని పంపాలనే దానిపై చాలా సేపు డిస్కషన్ నడిచింది. నేను పోటీకి దిగుతానంటూ ధైర్యంగా ముందుకు వచ్చింది అనీ మాస్టర్. జెస్సీకి పోటీ ఇచ్చిన అనీ మాస్టర్ నెలకొరిగింది. ఇక్కడ జెస్సీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ చూపించాడు. మహిళతో పోటీ పడినందుకు తాను క్షమాపణలు చెప్పాడు. అనంతరం ప్రియాంక.. శ్వేత పోటీ పడగా, ప్రియాంక తనంతట తానే ఓటమి పాలైంది.