ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ హీరోగా పరిచమతున్న విషయం తెలిసిందే. ఆయన కథానాయకుడిగా ‘దక్షిణ’ పేరుతో రెండో సినిమాకు అంగీకరించారు. ఈ చిత్రానికి ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించబోతున్నారు. నేడు జానీమాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది. దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ ‘ఇదొక సూపర్నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా, బెంగళూరుల్లో చిత్రీకరణ జరుపుతాం. నిర్మాణ సంస్థ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.