ముంబై : బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈనెల 5న జరిగిన తన సోదరి ఖుషి కపూర్ 21వ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరూ పింక్ కలర్లో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసిన జాన్వి హ్యాపీ బర్త్డే టూ మై హోల్ ఎంటైర్ లైఫ్ అని హార్ట్ ఎమోజీని జత చేసింది.
ఇక తాజాగా ఖుషి బర్త్డే పార్టీకి సంబంధించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జాన్వి హ్యాపీ బర్త్డే మై లడ్డూ బేబీ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పార్టీకి హాజరైన నటి గుంజన్ సక్సేనా కూడా బర్త్డే పార్టీ ఫోటోలను షేర్ చేశారు.