జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రంలో ఆదివారం శ్రీమాతా అంబాభవానీ ఆలయంలో స్వామి శ్రీవాత్సల్య ధర్మవీర అరుణాచలం దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై గౌరీపుత్ర గణేశా’ సినిమా చివరి షెఢ్యూలు షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ ముందుగా శ్రీమాతాఅంబా భవానీ ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.
రాజోళి అమ్మవారి దర్శన భాగ్యం మరువలేనిదని చివరి షూటింగ్ ఇక్కడ జరగడం సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ బృందం రాజా రామకృష్ణవర్మ, శ్రీమణి, నూతన తారలు అభి, కావ్య, రాంప్రసాద్లతోపాటు కారాటే కల్యాణి, ఘర్షణ శ్రీనివాస్ పాల్గొన్నారు.