Jahnvi kapoor in ntr movie |ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేశాడు బుచ్చిబాబు సనా. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది.సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఉప్పెన రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్తో బుచ్చిబాబు టాలీవుడ్లో బిజియెస్ట్ దర్శకుడిగా మారిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ బుచ్చిబాబు ఉప్పెన తర్వాత తన రెండో సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయమే పట్టేలా కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్తో బుచ్చిబాబు తన రెండో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాలు అన్నీ పాన్ ఇండియన్ లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే బుచ్చిబాబు సినిమాను కూడా పాన్ఇండియన్ మూవీగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అందుకోసమే బాలీవుడ్లో ఫాలోయింగ్ ఉన్న జాన్వీ కపూర్ను ఈ సినిమా కోసం కథానాయికగా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలారోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించబోతుందనే అప్పట్లో కూడా గుసగుసలు వినిపించాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు జాన్వీకపూర్ను అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో లైగర్ తర్వాత తెరకెక్కబోయే సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పుణ్యమా అని సమ్మర్కు పోస్ట్పోన్ అయింది. ట్రిపుల్ఆర్ తర్వాత ముందుగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. దీని తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో మరో సినిమా చేయనున్నాడు తారక్. ఈ రెండు సినిమాలు అయిపోయాకే బుచ్చిబాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదంటే ముందే పట్టాలెక్కనుందా అనేది తెలియాల్సి ఉంది.