Pushpa-2 Movie | అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో హిందీ బెల్ట్పై కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే కేవలం మౌత్ టాక్తో బాలీవుడ్ జనాలను థియేటర్లకు రప్పించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం మనమెంత ఆసక్తితో ఎదురు చూస్తున్నామో నార్త్ ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా విశాఖ షూటింగ్లో పాల్గొన్నాడు. పది రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన పాత్రకు సంబంధించిన విషయాలను చివరి వరకు సస్పెన్స్లో పెట్టాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. విశాఖ షెడ్యూల్ పూర్తవ్వగానే పుష్ప టీమ్ తిరిగి హైదరాబాద్లో మేజర్ షెడ్యూల్ను స్టార్ట్ చేయనుంది. ఈ షెడ్యూల్లో జగపతి బాబు పాల్గొననున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఫిబ్రవరి నుండి రష్మిక షూటింగ్లో పాల్గొననుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుంది.