Jagapathi Babu | తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో నటించిన గోదారి గట్టుపైన చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జరిగిన మూవీ ప్రమోషన్స్లో దర్శకుడు సుకుమార్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చనీయాంశంగా మారాయి. మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జగపతిబాబు.. సుకుమార్ కథ చెప్పే స్టైల్ గురించి సరదాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుకుమార్కు అసలు కథ చెప్పడం రాదు.. ఈ విషయం అతడే ఒప్పుకుంటాడు అంటూ నవ్వులు పూయించారు.
నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో సుకుమార్ తనకు కథ చెప్పడానికి ప్రయత్నించాడని, కానీ చివరకు విసిగి “సార్.. ఇవన్నీ కాదు, మీరు చేసేయండి” అన్నాడని జగపతిబాబు గుర్తుచేసుకున్నారు. దర్శకుడిపై నమ్మకంతో తాను కూడా వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. అలాగే రంగస్థలం కథ చెప్పిన సందర్భాన్ని కూడా ఆయన సరదాగా వివరించారు. ఆ సినిమా కథ చెప్పడానికి ముందు సుకుమార్ గంటన్నర యోగా చేసి వచ్చాడు. వచ్చాక కూడా ‘సార్.. ప్రెసిడెంట్ సార్.. చొక్కా ఉండదు సార్.. చుట్ట ఉంటుంది సార్.. బావుంటుంది సార్’ అన్నాడు. నేను వెంటనే కథ ఓకే.. డేట్స్ ఎప్పుడు చెప్పు అన్నాను అంటూ చెప్పుకొచ్చారు. జగపతిబాబు వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. దర్శకుడిపై ఉన్న నమ్మకంతోనే తాను కథల వివరాలు అడగకుండా సినిమాలు ఒప్పుకుంటానని ఆయన మాటల్లో స్పష్టమైంది.
ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జగపతిబాబు.. సింహస్వప్నం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అనంతరం గాయం, శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తర్వాత అంతఃపురం వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కెరీర్ ఒక దశలో మందగించిన సమయంలో లెజెండ్ సినిమాలో విలన్గా కనిపించి సెకండ్ ఇన్నింగ్స్కు ఘనమైన శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత శ్రీమంతుడు, అరవింద సమేత వీర రాఘవ, సలార్ వంటి భారీ చిత్రాల్లో తన నటనతో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయారు.