Jaat Movie – Religious controversy | బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఒక సన్నివేశం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నటులు సన్నీ డియోల్తో పాటు రణ్దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్లపై కేసు రిజిస్టర్ చేశారు జలంధర్ పోలీసులు. జాట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 10వ తేదీన జాట్ చిత్రం విడుదల కాగా.. ఆ ఫిల్మ్లో క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సీన్ ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌరవపరుస్తున్న రీతిలో సీన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో కావాలనే ఆ సినిమాను రిలీజ్ చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే డైరెక్టర్, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా వుంటే.. తాజాగా ఈ వివాదంపై జాట్ టీమ్ క్షమాపణలు తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేసింది. జాట్ సినిమాలోని ఒక సన్నివేశం ఒక మతం వారిని కించపరిచినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేం బాధపడడంతో పాటు వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాం. ఈ సినిమాతో ఎవరి మనోభావాలూ కించపరిచే ఉద్దేశం మాకు లేదంటూ చిత్రబృందం రాసుకోచ్చింది.
Our sincere apologies to everyone whose sentiments were hurt.
The objectionable scene has been removed.#JAAT pic.twitter.com/vj8tbKDxoi— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025