అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఆనంది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు అల్లరి నరేశ్ టీం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మరో అప్డేట్ వచ్చింది.
మారేడుమిల్లి ప్రజానీకం చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ‘ ఎన్నికల విధులకు క్లియరెన్స్ వచ్చింది..’ అంటూ తాజా అప్డేట్ అందించారు మేకర్స్. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా అడవుల మధ్యలో జీవనం సాగిస్తున్న మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే పోలింగ్ అధికారిగా అల్లరి నరేశ్ కనిపించబోతున్నాడు.గ్రామస్థులతో ఓట్లు వేయించే క్రమంలో ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయనే నేపథ్యంలో సినిమా సాగనుంది. అల్లరి నరేశ్ నాంది తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Got the Clearance for the Election Duty! #ItluMaredumilliPrajaneekam
has been Certified with U/A ✅Witness the Ultimate Fight for Identity 👊#IMP #IMPonNov25th@allarinaresh @anandhiactress @dir_armohan @ZeeStudios_ @RajeshDanda_ @lemonsprasad @_balajigutta pic.twitter.com/JG9mIfKmNu
— Hasya Movies (@HasyaMovies) November 18, 2022
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ..
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్..