‘ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇందులో నలభైశాతం కామెడీ ఉంటుంది. మిగతా కథ ఎమోషనల్గా సాగుతుంది’ అని అన్నారు అల్లరి నరేష్. ఆయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ.ఆర్.మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను టీచర్గా కనిపిస్తా. చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా 17 ఏళ్ల కల. ప్రజల జీవితాన్ని తెరపై చూపాలనే కోరికతో ఈ కథ రాసుకున్నా. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది’ అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాను విజయవంతం చేసి నిర్మాతగా తన మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని నిర్మాత రాజేష్ దండా కోరారు.