తమిళ అగ్ర నటుడు సూర్య కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కార్తికేయ-2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు చందు మొండేటి. ఆయన మేకింగ్ శైలికి మెచ్చిన పలువురు అగ్ర హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సూర్యను కలిసిన చందు మొండేటి విభిన్నమైన కాన్సెప్ట్తో కూడిన ఓ కథను వినిపించారని తెలిసింది. సబ్జెక్ట్లోని కొత్తదనం నచ్చడంతో సూర్య వెంటనే అంగీకారం తెలిపారని అంటున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనుందని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సిరుతాయ్ శివ దర్శకుడు. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ టీజర్కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే చందు మొండేటి దర్శకత్వం వహించే సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.