బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. నేటి నుంచి కర్నూల్ కొండారెడ్డి బురుజులో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు.
‘ఈ చిత్రాన్ని పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. బాలకృష్ణ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్, చంద్రిక రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.