గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్నది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. అయితే.. అంత విజయం తర్వాత కూడా అనుకున్న స్థాయిలో తనకు అవకాశాలు రాకపోవడం పట్ల ఇటీవల ఆమె స్పందించారు. ‘నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నా. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు వస్తాయని ఆశించా.
కానీ అలా జరగలేదు. తెలుగులో ఇప్పుడొస్తున్న హీరోయిన్ పాత్రలు ఐశ్వర్య చేయగలదా? అనే డౌట్ టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోల్లో ఉందేమో. అందుకే అవకాశాలు తగ్గాయేమో. అయితే నావరకూ నాకొస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నా. ‘కాకా ముైట్టె’ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. ఆ సినిమా టైమ్లో నా వయసు 21ఏళ్లు. ఇప్పటివరకూ నటిగా నా పాత్రలే నా గౌరవాన్ని పెంచాయి’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్యరాజేష్.