‘భీమ్లానాయక్’ ‘సార్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్తమీనన్. ప్రస్తుతం ఆమె సాయిధరమ్తేజ్ సరసన ‘విరూపాక్ష’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృందం మాట తప్పారని సంయుక్తమీనన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘ ఉగాది రోజున నా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేస్తారని మాటిచ్చారు. నేను ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎందుకు మాట తప్పారు? అంటూ సోషల్మీడియా వేదికగా ప్రశ్నించిందీ అమ్మడు.
ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. సరైన సమయంలో పోస్టర్ను విడుదల చేస్తామని, అనివార్య కారణాల వల్ల పోస్టర్ విడుదల చేయడం సాధ్యపడలేదని పేర్కొంది. నిర్మాణ సంస్థ స్పందనతో శాంతించిన సంయుక్తమీనన్ ‘సరే..నేను ఎదురుచూస్తుంటా’ అని జవాబిచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రమోషన్లో భాగంగా సినిమాపై ఆసక్తిని పెంచడానికే సంయుక్త మీనన్ ఇలాంటి ట్వీట్లు చేసిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.