Rahul ramakrishna | తనదైన నటనతో, మంచి కామేడియన్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. జాతిరత్నాలు సినిమాలోని నావల్లనే ప్రాబ్లమైతే నేను ఈడ నుంచి ఎల్లిపోతరా అనే డైలాగ్ ఈయనకు మించిన టైమింగ్తో ఎవరు చెప్పలేరెమో అన్నట్టు ఉంటుంది. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, కల్కి,జాతిరత్నాలు వంటి సినిమాలలో తన టైమింగ్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే మోస్ట్ వాంటెడ్ కమేడియన్గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈయన 2022 తన చివరి సంవత్సరం..అని ఆ తర్వాత సినిమాలను చేయనని, నటనకు పూర్తిగా దూరమౌతున్నట్టు ట్విట్టర్లో వెల్లడించాడు. నిజంగానే ఈయన సినిమాలకు దూరయమౌతున్నాడా..? లేదంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ట్వీట్ చేశాడా అని తెలియాల్సి ఉంది.
కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్మునిశ్చయమ్మురా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రాహుల్ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సనిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత గీతాగోవిందం, కల్కి, జాతిరత్నాలు, సమ్మోహనం, హుషారు, స్కైలాబ్ వంటి సినిమాలతో కామేడియన్గా దూసుకుపోతున్నాడు. అయితే ఆయన ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటనేది మాత్రం తెలియడం లేదు.ప్రస్తుతం ఈయన నటించిన ట్రిపుల్ఆర్, విరాటపర్వం విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022