Mahesh Babu-Pawan Kalyan | తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజుల కొనసాగుతున్న స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా వీళ్లకు వీరే సాటి. వీళ్ల సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆ రోజు టాలీవుడ్లో అదొక పండగే. అంతేకాదు వీళ్లిద్దరూ మంచి స్నేహితులని కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. ఆ మధ్య వీళ్లలో దూరం పెరిగిందని రూమర్స్ వచ్చాయి కానీ అదంతా ఏం లేదని.. తాము మంచి స్నేహితులమని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చేశాడు. కాగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. జల్సాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తేనే థియేటర్లు ఊగిపోయాయి. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్పై కనిపిస్తే పూనకాలు రావడం ఖాయం.
అలాంటి పూనకాలు తెప్పించే వార్త ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఓజీ సినిమాలో మహేష్ కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడన్న న్యూస్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా మహేష్ ఇప్పటివరకు ఒక్క సినిమాలోనూ అతిథిపాత్రలో కనిపించలేదు. అలాంటిది మహేష్తో ఓజీలో క్యామియో చేయించాలని చిత్రయూనిట్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. పైగా ఇది త్రివిక్రమ్ సలహానేనని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న మహేష్ మరీ ఈ క్యామియో రోల్ గురించి ఏమంటాడో చూడాలి. అయితే కొంత వరకు మాత్రం ఇదే పక్కా గాసిప్ అనే అంటున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం మహేష్ తీరికలేకుండా గుంటూరు కారం షూటింగ్లో పాల్గొంటున్నాడు. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం రెడీ కానున్నాడు. మరీ ఈ లెక్కన మహేష్ క్యామియో చేసే టైమ్ ఎక్కుడుందన్న ప్రతిపాదన కొందరిది. అయితే గుంటూరు కారం తర్వాతే ఈ క్యామియోకి సంబంధించిన చర్చలు జరగనున్నాయని వినిపిస్తుంది. ఏదేమైనా పవర్ స్టార్, సూపర్ స్టార్ ఒకే తెరపై కనిపిస్తే తెలుగు సినీ ప్రేక్షకులకు మించిన ఆనందమయులు మరొకరు ఉండరు.