Lokesh kanagaraj | ఆరేళ్ల క్రితం వచ్చిన ‘మా నగరం’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కార్తి, విజయ్లతో వరుసగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు సాధించాడు. దాంతో లోకేష్ పేరు తమిళనాట మార్మోగిపోయింది. ఇక గతేడాది రిలీజైన ‘విక్రమ్’తో లోకేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేని కమల్ను ఏకంగా రూ.400 కోట్ల క్లబ్లో నిలబెట్టాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న లియో పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమాను రజనీకాంత్తో చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి లియో తర్వాత లోకేష్ ఖైదీ-2 చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం కార్తి కూడా రెండు సినిమాలను సెట్స్మీదుంచాడు. అవి పూర్తి కావడానికి దాదాపు ఏడాదైనా పడుతుంది. దాంతో ఈ లోపు రజనీతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.