IPL Final | ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్కు రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా మండు వేసవిలో అభిమానులను అద్భుత ఆటతీరుతో అలరించిన లీగ్లో ఆఖరి ఆటకు వేళయైంది. లీగ్ స్టేజ్లో టాప్- 2లో నిలిచిన జట్లు సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్రైడర్స్ టైటిల్ కోసం అమీతుమి తేల్చుకోనున్నాయి. ఆదివారం చెన్నై చిదంబరం స్టేడియం ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేదికగా కానుంది. ఓవైపు 10ఏళ్లుగా మూడో టైటిల్ కోసం ఎదురుచూస్తున్న కోల్కతా, మరోవైపు రెండో ఐపీఎల్ ట్రోఫీని నెగ్గాలనే పట్టుదలతో సన్రైజర్స్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉండడం ఖాయం అనిపిస్తుంది.
ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు విజయం సాధించాలని టాలీవుడ్ సెలబ్రిటీస్ వీడియో రూపంలో స్పెషల్ విషెస్ తెలిపారు. సన్రైజర్స్ హైదరాబాద్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. విజయ్ దేవరకొండ, నాగార్జున, వెంకటేష్, విశ్వక్ సేన్, అంజలి, శ్రీనివాస్ రెడ్డి, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సాయి కుమార్ తదితరులు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రికార్డులు బ్రేక్ అయ్యాయ్
స్టేడియాలు హోరెత్తిపోయాయ్ 💥మరి సునామీ సృష్టించిన @SunRisers కు సెలబ్రిటీస్ సెండ్ చేసిన స్పెషల్ విషెస్ చూసేయండి 🤩
చూడండి#TATAIPL ఫైనల్
Kolkata v Hyderabad | 5:30 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu pic.twitter.com/wvrifqWt6U— StarSportsTelugu (@StarSportsTel) May 26, 2024