ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించే. ఈ సినిమాలో దర్శకుడు ఏ సందేశం ఇవ్వబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమా చేశాడు. ఇందులో చెట్లనునరకొద్దు..పర్యావరణాన్ని కాపాడండి అంటూ మేసేజ్ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తో ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది.
సినీవర్గాల సమాచారం మేరకు ఇందులో కూడా ఓ మెసేజ్ ఉందట. గ్రామం నుంచి పట్నానికి వచ్చిన అమాయకపు హీరో అక్కడున్న పరిస్థితులను ఎలా మార్చగలిగాడన్నది ఈ సినిమా లైనప్ అని చెబుతున్నారు. కరోనా టైమ్ ని బేస్ చేసుకుని ఈ సినిమా కథని రెడీ చేసినట్లు ఉన్నాడు కొరటాల.
ఇందులో హీరోయిన్ గా మహేష్ హీరోయిన్ కియారా అద్వానీని తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకి కూడా కొరటాల స్నేహితుడే నిర్మాత కావడం విశేషం. ఆచార్యసినిమాషూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమాని మొదలుపెట్టబోతున్నాడట కొరటాల. ఇంతకుముందు జనతాగ్యారేజ్ లోమాస్ అండ్ క్లాస్ గా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి లుక్ లో కనిపిస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది.