Rajamouli & Prashanth Neel | నిజమే కదా ఇండియన్ సినిమాలో ఇంతకంటే రిచెస్ట్ ఫ్రేమ్ మరొకటి ఉండదేమో. ఈ ఇద్దరు దర్శకుల స్థాయి ఇప్పుడు 3000 కోట్లు దాటిపోయింది అంటే నమ్మడం సాధ్యం కాదు. ఒకరేమో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు.. మరొకరు కన్నడ సినిమాను ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు.. ఈ ఇద్దరు ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ అండ్ టు దర్శకులుగా ఉన్నారు. వీళ్లతో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. నిర్మాతలు 1000 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు. ఒకవైపు రాజమౌళి.. మరోవైపు ప్రశాంత్ నీల్ అలా కలిసి మాట్లాడుకుంటుంటే కెమెరా క్లిక్ అనిపించిన దృశ్యం ఇది.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల సినిమా ఓపెనింగ్ ఇద్దరు దర్శకులు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ రాజమౌళితో మొన్నే సినిమా చేశాడు తారక్.. ప్రస్తుతం కొరటాల సినిమా అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. 2024లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం అదిరిపోయే లైన్ సిద్ధం చేశాడు ప్రశాంత్. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్న ఈయన.. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటున్నాడు. ఈ లోపు కొరటాల సినిమా పూర్తి చేసి ప్రశాంత్ కోసం మేకోవర్ కానున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఏదేమైనా తారక్ సినిమా ఫంక్షన్ లో రాజమౌళి ప్రశాంత్ నీల్ ఇలా కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు మాత్రం పండగే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఏకంగా 5000 కోట్లు వసూలు చేశాడు రాజమౌళి. అలాగే కేజీఎఫ్ సిరీస్ తో 2 వేల కోట్ల క్లబ్ లో చేరిపోయాడు ప్రశాంత్ నీల్. సౌత్ ఇండస్ట్రీని బాలీవుడ్ కనీసం కలలో కూడా టచ్ చేయలేనంత ఎత్తుకు చేర్చారు ఈ ఇద్దరు దర్శకులు.