Ileana | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ ప్రస్తుతం సినిమాలకంటే తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఆమె తన భర్త మైఖేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముందు కోవా ఫీనిక్స్ డోలన్కి జన్మనిచ్చిన ఇలియానా, ఆ తర్వాత ‘కీను రాఫే డోలన్’ కు జన్మనిచ్చారు. అయితే తన రెండవ గర్భధారణ, ప్రసవ అనుభవాలను ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మొదటి బిడ్డను కన్నప్పుడు అన్ని కూడా అంగీకరించే ప్రయత్నం చేశాను. ఒంటరి మహిళ నుండి అకస్మాత్తుగా మారినట్టు అనిపించింది. ఆ తర్వాత బిడ్డ ఆరోగ్యం ఆలనాపాలనపై దృష్టి పెట్టాను.
కానీ రెండో బిడ్డ పుట్టేప్పటికి మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. గందరగోళంలో పడ్డాను. దాంతో కష్టంగా అనిపించిందని ఇలియానా పేర్కొంది. స్నేహితులు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మద్దతు లేకుండా పోయింది. ఏకాంతంలో ఉండడం ఓ సవాల్ అయ్యింది అని ఇలియానా పేర్కొంది. ఇలియానా ప్రస్తుతం విదేశాల్లో నివాసం ఉంటుంది. అక్కడ భర్తతో కలిసి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ, ముంబయిని తాను చాలా మిస్ అవుతున్నానని వెల్లడించారు. అక్కడ ఉన్న స్నేహితుల సపోర్ట్, మానసిక స్థైర్యం కోసం పొందిన సహాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు.
వృత్తిపరంగా చూస్తే, ఇలియానా చివరిసారి 2024లో విడుదలైన హిందీ చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ లో కనిపించారు. ఈ చిత్రంలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. అయితే ఆ సినిమా తర్వాత ఇలియానా ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం పిల్లల పెంపకమే తన ప్రధాన బాధ్యతగా చెబుతుంది “పిల్లలు కొంచెం పెద్దవాళ్లయ్యాకే కెరీర్పై మళ్లీ దృష్టి పెడతాను అని ఇలియానా పేర్కొంది. 2023లో మైఖేల్ డోలన్ను వివాహం చేసుకున్న ఇలియానా, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా పూర్తి స్థాయి ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్యామిలీతో గడిపే ప్రతీ క్షణం ప్రత్యేకమని, మాతృత్వంలో దొరికే ఆనందం మరే ఇతర అనుభవంతో పోల్చలేనిదని పేర్కొంది.