Sandeep Reddy | సినీ ఇండస్ట్రీలో యానిమల్ సినిమా ఒక సంచలనం. తండ్రీకొడుకుల సెంటిమెంట్కు ఫుల్ లెంగ్త్ వయలెన్స్ను జోడించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచింది. ఓటీటీలో కూడా రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాను ఎంతగా పొగుడుతున్నారో.. అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్తో పాటు స్త్రీలపై విద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఈ చిత్రం ఉందంటూ క్రిటిక్స్తో పాటు సినీ ప్రముఖులు ఈ సినిమాను విమర్శిస్తున్నారు. ఇది ఆడియన్స్పై చెడు ప్రభావం చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇలా తన సినిమాపై ఎంతమంది ఎన్నిరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ సందీప్ రెడ్డి వంగా మాత్రం తగ్గడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో యానిమల్ పార్క్ను తెరకెక్కిస్తాననే చెబుతున్నాడు. తనను ఎవరూ ఆపలేరు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ ఇండియాలో తన సినిమాలను ఆపితే హాలీవుడ్కు వెళ్లిపోతానని చెబుతూనే తనపై విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనకు భాషతో సంబంధం లేదని.. తెలుగు, హిందీలోనే కాదు కన్నడ, మలయాళం, పంజాబీ, భోజ్పురితో పాటు ఇతర ఏ భాషలో అయినా సరే సినిమాలు చేస్తానని స్పష్టం చేశాడు.
యానిమల్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం యానిమల్ పార్ట్2 పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రభాస్తో స్పిరిట్ సినిమా మొదలుపెట్టనున్నారు. ఇక యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్, రష్మిక మంధన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, పృథ్వీ ముఖ్యపాత్రల్లో కనిపించారు.