గతేడాది మట్టి కుస్తీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). మరోవైపు భారీ మల్టీ స్టారర్ పొన్నియన్ సెల్వన్ -1లో సముద్రకుమారి పాత్రలోనూ మెరిసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ కోలీవుడ్ యాక్టర్ అర్జున్తో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఐశ్వర్య లక్ష్మి-అర్జున్ దాస్ (Arjun Das) ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అవుతున్నారంటూ జోరుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తన పోస్టుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి.
‘హాయ్ నేను పెట్టిన పోస్ట్ ఇంతలా పేలుతుందని ఊహించలేకపోయా. మేమిద్దరం (అర్జున్దాస్-ఐశ్వర్యలక్ష్మి) కలుసుకున్నపుడు దిగిన సెల్ఫీని ఇలా పోస్ట్ చేయడం జరిగింది. మేం స్నేహితులం. నాకు నిన్నటి నుంచి మెసేజ్లు పంపుతున్న అర్జున్ దాస్ అభిమానులు ప్రశాంతంగా ఉండండి.. అర్జున్ దాస్ మీ అందరివాడు..’ అంటూ పుకార్లకు చెక్ పెట్టింది ఐశ్వర్య లక్ష్మి.
ఐశ్వర్యలక్ష్మి ప్రస్తుతం తమిళంలో పొన్నియన్ సెల్వన్ -2 కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు మలయాళంలో కింగ్ ఆఫ్ కోట, క్రిస్టోఫర్ చిత్రాల్లో నటిస్తోంది. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ప్రస్తుతం తెలుగులో బుట్ట బొమ్మ చిత్రంలో నటిస్తున్నాడు. అంగమళై డైరీస్ హిందీ రీమేక్లో కూడా నటిస్తున్నాడు. దీంతోపాటు మరో ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.