నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ-2’. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో వినూత్నరీతిలో ప్రచార కార్యక్రమాల్ని చేపడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఓ కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. మిస్టికల్ టెస్ట్ పేరుతో నిర్వహించే ఈ కాంటెస్ట్లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల రూపాయల విలువైన ప్రైజ్ మనీ అందించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘శ్రీకృష్ణుడి నేపథ్యంలో నడిచే కథ ఇది. ద్వాపర యుగం తాలూకు ఓ రహస్యం, దానిని శోధించే డాక్టర్ కార్తికేయగా నిఖిల్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాలభైరవ, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.